Friday, October 18, 2024

Nagpur: భ‌క్తిపార‌వ‌శ్యంలో విద్యార్థులు…ప్రార్థ‌న‌లో రాముని భ‌జ‌న పాట‌కు టీచ‌ర్ డ్యాన్స్‌

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ పాఠశాల విద్యార్థులు రాముడి భజన పాటకు డ్యాన్స్ చేశారు. ఉదయాన్నే ప్రార్థన సమయంలో లైన్లలో నిలబడి టీచర్‌తో కలిసి వారు డ్యాన్స్ చేసిన తీరు అలరిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆలయ ట్రస్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 22న రామయ్య ప్రాణప్రతిష్ఠకు వారం రోజుల ముందు నుంచే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో యావత్ భారతదేశం భక్తిపారవశ్యంలో మునిగిపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement