Thursday, September 19, 2024

Delhi | సుప్రీం తీర్పు వచ్చేవరకు చర్యలు నిలిపేయండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కృష్ణమోహన్ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం కేసులో పదవి పోగొట్టుకున్న గద్వాల మాజీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ జరుగుతుందని, అప్పటి వరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆయన కోరారు. ఈ మేరకు ఓ లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశారు.

హైకోర్టు తీర్పు ఆధారంగా డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించాలని ఆదేశిస్తూ చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ కార్యదర్శికి లేఖలు కూడా రాసింది. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి మొర పెట్టుకున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement