Monday, September 23, 2024

Stock Market – న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన స్టాక్ మార్కెట్ ..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఉదయం సమయంలో సెన్సెక్స్‌ 173 పాయింట్ల నష్టంతో 79,823 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 24,294 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.45 వద్ద ప్రారంభమైంది.

సెన్సెక్స్‌-30 సూచీలో టాటా మోటార్స్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌ అండ్‌ టీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటన్‌, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement