Friday, September 20, 2024

Stock Market Record – తొలిసారి 84 వేల మార్క్ క్రాస్ చేసిన సెన్సెక్స్…

ముంబై – ట్రేడింగ్ వారం చివరి రోజు భారత స్టాక్ మార్కెట్‌ హిస్టరీ క్రియేట్ చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ హై రికార్డును నెలకొల్పింది. నెమ్మదిగా వ్యాపారం ప్రారంభించిన కొద్దిసేపటికే మార్కెట్‌లో విపరీతమైన ర్యాలీని నమోదు చేసి, బిఎస్‌ఇ సెన్సెక్స్ చరిత్రలో తొలిసారిగా 84 వేల మార్క్‌ను దాటింది. సెన్సెక్స్ తొలిసారిగా 84,100ను అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. అంతకుముందు గురువారం కూడా సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరుకుంది. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. నిఫ్టీ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.. మొదటిసారిగా 25,650 దాటింది.

దేశీయ మార్కెట్ ఈరోజు ట్రేడింగ్‌ను స్వల్ప పెరుగుదలతో ప్రారంభించగా, ప్రారంభ సెషన్‌లో మార్కెట్‌పై ఒత్తిడి కనిపించింది. ఉదయం 9:15 గంటలకు సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ దాదాపు 100 పాయింట్లు పెరిగాయి. కొన్ని నిమిషాల తర్వాత, ఉదయం 9:20 గంటలకు సెన్సెక్స్ లాభం 175 పాయింట్లకు తగ్గింది.. 83,370 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.

- Advertisement -

ఉదయం 11 గంటలకు సెన్సెక్స్ 816 పాయింట్లకు పైగా (సుమారు 1 శాతం) అద్భుతమైన లాభంతో 83,985.07 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అంతకు ముందు సెన్సెక్స్ ఇంట్రాడేలో 84,026.85 పాయింట్లకు చేరుకుంది. సెన్సెక్స్ చరిత్రలో 84 వేల పాయింట్ల స్థాయిని దాటడం ఇదే తొలిసారి. అలాగే, 25,663.45 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత, నిఫ్టీ ఉదయం 11 గంటలకు దాదాపు 225 పాయింట్ల (0.90 శాతం) పెరుగుదలతో 25,645 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement