Tuesday, October 1, 2024

Odisha | పూరీ జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి, 15మందికి గాయాలు

ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 15 మంది భక్తులు గాయపడగా, ఒక భక్తుడు చనిపోయాడు. తొక్కిసలాటలో గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన భక్తులకు చికిత్స అందిస్తున్నారు.

53 ఏళ్ల తర్వాత పూరీలో జగన్నీథుని రథయాత్ర రెండు రోజుల పాటు కొనసాగుతోంది. 1971 నుండి, రథయాత్ర కేవలం ఒక రోజు మాత్రమే నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈ ఏడాది మాత్రం రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించారు. పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఈసారి రెండు రోజుల పాటు రథయాత్ర నిర్వహించగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు

Advertisement

తాజా వార్తలు

Advertisement