Friday, September 6, 2024

TG | రైల్వే సిబ్బందికి ప్రత్యేక వసతులు.. సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం

నిజామాబాద్ ప్రతినిధి (ప్రభ న్యూస్): రైల్వే సిబ్బందికి ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసినట్లు, లోకో పైలట్‌లు రైల్వే కుటుంబంలో ముఖ్యమైన సభ్యులనీ వారి సంక్షేమానికి రైల్వే ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తుందని హైదరాబాద్ డివిజన్ డివిజ నల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ అన్నారు.

నిజామాబాద్‌లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, రైలు మేనేజర్‌ (రన్నింగ్ స్టాఫ్)లకు అందిస్తున్న సౌకర్యాలపై మీడియా గైడెడ్ టూర్‌ని నిర్వహించింది. లోకో ఫైలట్, అసిస్టెంట్ లోకో ఫైలట్, రైలు మేనేజర్లను కలిపి రన్నింగ్ క్రూ సెటప్ గా పిలుస్తారు.

ఒక్కసారి ఒక ట్రిప్ కు వెళ్లి వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో అత్యాధునిక సౌకర్యవంతమైన రన్నింగ్ రూమ్ లు, లాబీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకసారి క్రూ సైన్ అయిన తర్వా త గదులను కేటాయిస్తారు. నిజామాబాద్‌ లోని క్రూ రన్నింగ్ రూమ్‌లో లోకో పైలట్‌ లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లు రైలు మేనే జర్‌లు (రన్నింగ్ స్టాఫ్)కి అందిస్తున్న సౌక ర్యాలపై మీడియాకు వివరించేందుకు హైదరాబాద్ డివిజన్ గైడెడ్ టూర్‌ని నిర్వహించింది.

రన్నింగ్ స్టాప్ కు ఏర్పాటు చేసిన సౌకర్యాలను వివరించేందుకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్ మాట్లాడుతూ… రైళ్ల రాకపోకల్లో పాల్గొనే ఫ్రెండ్ టైం రన్నింగ్ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. లోకో పైలట్‌లు రైల్వే కుటుంబంలో ముఖ్యమైన సభ్యులని, రైల్వే వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని తెలియజేశారు.

రన్నింగ్‌ సిబ్బంది నిర్ధారిత డ్యూటి గమ్యాన్ని చేరిన తరువాత తదుపరి డ్యూటి ఎక్కే వరకు వారికి సరియైన విశ్రాంతిని అందించేందుకు అన్నీ సౌకర్యాలతో కూడిన రన్నింగ్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రన్నింగ్ స్టాప్ పూర్తి గా విశ్రాంతి తీసుకున్న తర్వాతనే తిరిగి సైన్ ఆఫ్ చేసి మరో ట్రిప్ కు అనుమతి ఇస్తామని చెప్పారు.

- Advertisement -

లోకో పైలట్ అసి స్టెంట్ లోకో పైలట్ బయలుదే రేముందు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయ డంతో పాటు వారి బయోమెట్రిక్ ను, వెబ్ క్యాంలో ఫోటో తీసుకుంటామని వివరించారు. ఆ తర్వాత వారు పూర్తి సన్నద్ధంగా ఉన్న ట్లు నిర్ధారించుకున్న తర్వాతనే రైలు కాల్బ్ కు చేస్తామని వివరించారు.లోకో పైలట్‌ల పని గంటలను నిశితంగా పర్యవేక్షిస్తూ వారికి సమాయనుసారం ఇవ్వాల్సిన విశ్రాంతిని సమయానికి ఇస్తున్నామని చెప్పారు.

27 ఎయిర్ కండిషన్డ్ రూములు అందుబాటులోకి

నిజామాబాద్ రన్నింగ్ రూమ్‌లో మొత్తం 27 ఎయిర్ కండిషన్డ్ రూములు అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఈ రూమ్‌ల ద్వారా రోజుకు 60 మంది సిబ్బందికి వసతి కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. సిబ్బందికి సబ్సిడీ ధరలతో ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన భోజనం కూడా అందజేస్తామని అన్నారు.

ఈ రన్నింగ్ రూమ్‌లో లాంజ్/రీడింగ్ రూమ్, ధ్యానం కోసం యోగా గది, లాండ్రీ, షూ షైనింగ్ మెషిన్, క్లీన్ వాష్‌రూమ్‌లు, సోలా ర్ వాటర్ హీటర్లు, బెడ్ ఆక్యుపెన్సీ సిస్టమ్‌తో రిసెప్షన్, మెకనైజ్డ్ వాష్డ్ లినెన్, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

అనంతరం మీడియా సిబ్బందికి రన్నింగ్ రూమ్ వద్ద సిబ్బంది పని తీరుపై వివరించారు. ఈ టూర్ లో రన్నింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర అధికారులు మీడియా సిబ్బందితో కలిసి డైనింగ్ హాల్‌లో రన్నింగ్‌ సిబ్బందితో కలిసి భోజనం చేశారు.

డివిజనల్ రైల్వే మేనేజర్ మధ్యాహ్న భోజన సమయంలో లోకో పైలట్‌లతో వివరంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డివిజనల్ రైల్వే మేనేజర్ లోకో పైలట్‌లతో చర్చించి వారి నుండి సలహాలు తీసుకున్నారు. లోకో రన్నింగ్ సిబ్బందికి అనుకూలమైన పని పరిస్థితులు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

ఫైలట్ల పని తీరు, క్రూ బుకింగ్ లాబీ & రన్నింగ్ రూమ్‌లో సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాలు… ఇలా

హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ జీషన్ అహ్మద్ లోకో పైలట్ల పని తీరు, క్రూ బుకింగ్ లాబీ & రన్నింగ్ రూమ్‌లో సిబ్బందికి అందిస్తున్న సౌకర్యాలపై దృశ్య మాద్యమం ద్వారా మీడియాకు వివరించారు. ఈ క్రూ బుకింగ్ లాబీ రన్నింగ్ స్టాఫ్‌ ను డ్యూటీ కి తీసుకోవడానికై కేంద్రంగా పని చేస్తుంది.

ఈ లాబీలో లోకో పైలట్‌లు, అసిస్టెంట్ లోకో పైలట్లు, రైలు మేనేజ ర్‌లు (గార్డ్‌లు) సైన్ ఆన్/ సైన్ ఆఫ్ చేయడం కోసం ఇంటిగ్రేటెడ్ కియోస్క్‌ (బ్రీత్ ఎనలై జర్, బయో-మెట్రిక్ & వెబ్‌క్యామ్) లు ఏర్పాటు చేశారు.

డ్యూటీని చేపట్టేముందు, లోకో పైలట్‌లు బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ నిర్వహించి, ‘నో సిగ్నల్ పాసింగ్ ఎట్ డేంజర్’ పై ప్రమాణం చేయాలి, రైళ్లు సాఫీగా, సురక్షితంగా నడుస్తున్నాయని నిర్ధారించడానికి వారికి అందుబాటులో ఉంచిన అన్నీ కొత్త సర్క్యులర్‌ (భద్రత)లను విధిగా చదవాలని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ డాక్టర్ అనిరుధ్, పమర్, హైదరాబాద్ డివిజన్ సీనియర్ డివిజనల్ మెకానికల్ ఇంజనీర్ జీషన్ అహ్మద్, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement