Sunday, October 6, 2024

TG | మూసీనది నిర్వాసితుల జీవనోపాధి కోసం ప్రత్యేక కమిటీ

మూసీ నది నిర్వాసితుల జీవనోపాధి కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సెర్ఫ్ సీఈవో ఛైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్ వైస్ చైర్మన్ గా 14 మంది సభ్యులతో జీవనోపాధి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు.. తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement