Tuesday, September 17, 2024

TG: అభివృద్ధి పనులకు స్పీకర్, మంత్రి శంకుస్థాపన

వికారాబాద్, ఆగస్టు 5 (ప్రభ న్యూస్) : వికారాబాద్ నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర‌ రెవెన్యూ, గృహ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు రూ.60 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి నుండి రాళ్లచిట్టంపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు 12 కోట్ల వ్యయంతో, వికారాబాద్ పట్టణ కేంద్రంలో 4 సూటెడ్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.6 కోట్ల వ్యయంతో అదేవిధంగా మర్పల్లి నుండి కోట్ పల్లి వరకు వివిధ అనుసంధాన రోడ్ల నిర్మాణానికి రూ.42 కోట్ల వ్యయంతో నిర్మాణ పనుల శంకుస్థాపనలు చేశారు.

ముందుగా జిల్లా పర్యటనకు విచ్చేసిన శాసనసభ సభాపతి, మంత్రికి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభాపతి, మంత్రి పోలీస్ గొరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ మోహన్ నాయక్, ఎస్ఈ వసంత నాయక్, ఇంచార్జ్ ఈఈ శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, వైస్ చైర్మన్ శంషాద్ బేగం, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement