Thursday, October 24, 2024

Space Tourism – అంత‌రిక్ష యాత్ర‌కు టికెట్లు రెడీ

నేటి నుంచే విక్ర‌యం
ఒక్కో టికెట్ రేటు జెస్ట్ రూ.1.77 కోట్లు
అందుబాటులో రెండు సీట్లు మాత్ర‌మే
అధికారికంగా ప్ర‌క‌టించిన డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​ : చైనాకు చెందిన స్టార్టప్‌ డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ 2027లో అంతరిక్ష యాత్రకు ప్రయాణికులను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈక్రమంలో అంతరిక్షంలోకి వెళ్లే రాకెట్‌లోని రెండు సీట్ల టికెట్లు విక్రయానికి పెట్టింది. ఈ టికెట్టు ధర 1.5 మిలియన్‌ యువాన్లుగా (భారత కరెన్సీలో అక్షరాల రూ.1.77 కోట్లు) తెలిపింది. ఈ టికెట్లు నేటి నుంచి త‌మ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. సబ్‌ ఆర్బిటల్‌ ఫ్లైట్‌లో ప్రయాణికులను తీసుకువెళతామని తెలిపింది. అంటే రాకెట్‌ భూ వాతావరణాన్ని దాటి, అంతరిక్షం దరిదాపుల వరకూ వెళ్లి వస్తుంది. వచ్చే నెలలో మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు డీప్‌ బ్లూ ఏరోస్పేస్‌ తెలిపింది. ఇక చైనాలోని మరిన్ని కంపెనీలు స్పేస్‌ టూరిజం రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు ప్రకటించాయి. 2028 నాటికి స్పేస్‌ టూరిజం విమానాలను ప్రారంభించనున్నట్లు సీఏఎస్‌ తెలిపింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement