Monday, September 30, 2024

South Korea | బ్యాటరీ తయారీ కంపెనీలో పేలుడు.. 22 మంది మృతి

సౌత్‌కొరియాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సియోల్‌లోని లిథియం బ్యాటరీ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 22 మంది చనిపోయారు. మరో తొమ్మిది మందికి గాయాలు కాగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. మృతుల్లో 18 మంది చైనాకు చెందినవారు ఉన్నారు.

కంపెనీలోని రెండవ అంతస్తులో, సిబ్బంది బ్యాటరీల పనితీరును పర్యవేక్షిస్తుండ‌గా… పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కార్మికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇక సమాచారం అందుకున్న వెంటనే దాదాపు డజనకు పైగానే ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. విషయం తెలుసుకున్న పరిశ్రమల శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement