Saturday, June 29, 2024

South Central Railway : భారీగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలోని కాజీపేట-బల్హర్షా సెక్షన్‌లో బుధవారం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగనుంది. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఆసిఫాబాద్-రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడవ లైన్ నిర్మాణం కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లు రద్దు చేయబడ్డాయి. 26 ఎక్స్‌ప్రెస్‌లు దారి మళ్లించబడతాయి. రైళ్లు కనిష్టంగా ఒక రోజు నుండి గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేయబడతాయి.

దారి మళ్లించిన రైళ్లు: సికింద్రాబాద్-న్యూఢిల్లీ (నం. 12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కాజీపేట మీదుగా జూలై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముద్కేడ్ మీదుగా మళ్లించబడుతుంది. కాజీపేట, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి స్టేషన్‌లను ఆ మార్గం నుంచి తొలగించారు. న్యూఢిల్లీ-సికింద్రాబాద్ (నం. 12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ముద్ఖేడ్, నిజామాబాద్ మీదుగా జూలై 3, 4, 5 తేదీల్లో నడుస్తుంది. బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్‌లను ఆ మార్గం నుంచి తొలగించారు. సికింద్రాబాద్-నిజాముద్దీన్ (ఢిల్లీ), నిజాముద్దీన్-సికింద్రాబాద్ దురంతో ఎక్స్‌ప్రెస్ (నెం. 12285/12286) రైళ్లను జూలై 4, 5 తేదీల్లో నిజామాబాద్ మీదుగా మళ్లిస్తారు.

రద్దు చేయబడిన రైళ్లు: సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (నం. 12757/12758) జూన్ 26 నుండి జూలై 6 వరకు రద్దు చేయబడ్డాయి. పూణే-కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ (నం. 22151) జూన్ 28 , జూలై 5న.. కాజీపేట-పూణే ఎక్స్‌ప్రెస్ (నం. 22152) జూన్ 30న , జూలై 7న. జూన్ 28న హైదరాబాద్-గోరఖ్‌పూర్ (నం. 02575), జూలై 30న గోరఖ్‌పూర్-హైదరాబాద్ (నం. 02576) ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడ్డాయి. జూలై 2న ముజఫర్‌పూర్-సికింద్రాబాద్ (నం. 05293), జూలై 27న సికింద్రాబాద్-ముజఫర్‌పూర్ (నం. 05294), జూన్ 29న గోరఖ్‌పూర్ జడ్చర్ల (నం. 05303), జడ్చర్ల-గోరఖ్‌పూర్ (నం. 05304) రైళ్లు రద్దు చేయబడ్డాయి. జూన్ 26, 27 , 28 తేదీల్లో సికింద్రాబాద్-రక్సాల్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 28, 29 , జూలై 1 తేదీల్లో సికింద్రాబాద్-దానాపూర్ మధ్య తిరిగే ఆరు ప్రత్యేక రైళ్లు. జూన్ 27, 29 తేదీల్లో సికింద్రాబాద్-సుబేదర్‌గంజ్ మధ్య తిరిగే రైళ్లు రద్దు చేయబడ్డాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement