Friday, September 13, 2024

TG | హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే : రేవంత్ రెడ్డి

తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని హుసేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దాంతో పాటు నల్లగొండలోని నాగార్జున సాగర్ లో ఉన్న బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని, బ్యాక్ వాటర్ వరకు బోటింగ్ ను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నది.

వీటితోపాటు ఫణిగిరి, నేలకొండపల్లి టూరిజం సర్క్యూట్, హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ స్కైవాక్ వే ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. హైదరాబాద్ – నాగార్జునసాగర్ మధ్య నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదన తీసుకొచ్చిన తెలుస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement