Sunday, September 15, 2024

Paralympics | భారత్ కు ఆరో గోల్డ్.. హై జంప్ లో ప్రవీణ్ కు స్వ‌ర్ణం

పారిస్ పారాలింపిక్స్ 2024 లో భారత్ పతకాల వేట తొమ్మిదో రోజు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన పురుషుల హైజంప్ ఈవెంట్‌లో ప్రవీణ్ కుమార్ అద్భుతంగా ప్రదర్శన చేసి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో చరిత్రలో తన రెండవ, 11వ పతకాన్ని సాధించడానికి 2.08 మీటర్ల అద్భుతమైన జంప్‌ను నమోదు చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన 21 ఏళ్ల అథ్లెట్ మరియప్పన్ తంగవేలు తర్వాత పారాలింపిక్స్‌లో హైజంప్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించిన రెండవ భారతీయుడిగా నిలిచాడు. అమెరికాకు చెందిన డెరెక్ లోసిడెంట్ 2.06 మీటర్ల జంప్‌తో రజతం సాధించగా, ఉజ్బెకిస్థాన్‌కు చెందిన టెముర్బెక్ గియాజోవ్ 2.03 మీటర్ల జంప్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement