Friday, October 18, 2024

TS | రాష్ట్రం పారిశ్రామికాభివృద్ధికి ఆరు కొత్త పాలసీలు…

తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (మంగళవారం)కి సంబంధించి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఆరు కొత్త విధానాలను రూపొందించనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అవలంభించాల్సిన కొత్త విధానాలపై సీఎం పలు సూచనలు చేశారు.

రాష్టర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ‘‘ఎస్ఎంఈ పాలసీ, ఎక్స్ పోర్ట్ పాలసీ, న్యూ లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ’’ఆరు కొత్త పాలసీలను రూపొందిస్తుమన్నామని అధికారులు వివరించారు. ఈ క్రమంలో టెక్స్ టైల్స్‌కు సంబంధించి రాష్ట్రంలోని పవర్ లూమ్, హ్యాండ్ లూమ్ కార్మికులకు ఉపయోగపడేలా కొత్త పాలసీని రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు.

ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామిక పాలసీలను పూర్తిస్థాయిలో రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలని… అందుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ది బెస్ట్ పాలసీలను అధ్యయనం చేయాలని అన్నారు. ఈ సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement