Tuesday, September 17, 2024

Shashabad – ఎయిర్ పోర్ట్ లో క‌విత‌కు ఘ‌న స్వాగ‌తం ..

శంషాబాద్ – ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ నుంచి శంషాబాద్‌కు విమానంలో చేరుకున్నారు…. ఎయిర్ పోర్ట్ లో అమెకు గులాబీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా గులాబీ నేతలు, కార్యకర్తలు కవితపై పూలవర్షం కురిపించగా.. పార్టీ శ్రేణులకు కవిత అభివాదం చేశారు. పడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. కార్యకర్తల జై తెలంగాణ నినాదాలతో ఎయిర్‌పోర్ట్‌ దద్దరిల్లింది.

ఐదునెలల తర్వాత కవిత హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె వెంట బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కెటిఆర్ , మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు,కవిత భర్త అనిల్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలు ఉన్నారు. కాగా కవిత ఎయిర్‌పోర్ట్‌ నుంచి ర్యాలీగా బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.. ఇది ఇలా ఉంటే . గురువారం ఎర్రవెల్లిలోని ఫామ్‌ హౌస్ వెళ్లి తండ్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement