Tuesday, September 17, 2024

Shamshabad – దేవినేని అవినాశ్ దుబాయ్ ప‌ర్య‌ట‌న‌కు బ్రేక్

శంషాబాద్ విమానాశ్ర‌యంలోఆడ్డుకున్న సిబ్బంది
అత‌డిపై లుకౌట్ జారీ చేసిన ఎపి పోలీసులు
దీంతో దుబాబ్ వెళ్ల‌కుండా ఎయిర్ పోర్ట్ లో నిలిపివేత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – శంషాబాద్ – దుబాయ్ వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత దేవినేని అవినాశ్ ను శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనపై కేసులు నమోదైన నేపథ్యంలో ప్రయాణానికి అనుమతించవద్దని మంగళగిరి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శంషాబాద్ లో విమానం ఎక్కకుండా అవినాశ్ ను అధికారులు అడ్డుకున్నారు. లుకౌట్ నోటీసు ఉందని గుర్తుచేశారు. దీంతో చేసేదేంలేక విమానాశ్రయం నుంచే అవినాశ్ వెనక్కి వెళ్లిపోయారు. శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుందీ ఘటన. కాగా, టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాశ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడ్డ వారిలో కొంతమంది దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని పేర్కొంటూ అవినాశ్ సహా పలువురిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement