Friday, September 20, 2024

Judgement Day | బాలికపై లైంగిక దాడి.. దోషికి ఉరి శిక్ష

సంగారెడ్డి, ప్ర‌భ‌న్యూస్‌ : సంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్ప‌డిన గ‌ఫార్ ఖాన్ (56)కు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు (గురువారం) తీర్పు చెప్పింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.ప‌ది ల‌క్ష‌లు ఇవ్వాల‌ని తీర్పులో పేర్కొంది.

ఘ‌ట‌న వివ‌రాలు…

బిహ‌ర్‌కు చెందిన‌ గఫార్ ఖాన్(56) అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వచ్చారు. చైతన్య కంపెనీ పక్కన లేబర్ రూములో నివాసం ఉంటున్నాడు. అయితే అదే ఏరియాలో ఉంటోన్న ఆరేళ్ల బాలికకు కూల్ డ్రింక్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. అందులో మద్యం కలిపి తాగించి పత్తి చేనులోకి తీసుకెళ్లి పాపపై లైంగిక దాడి చేశాడు. అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కేసు విచార‌ణ అనంత‌రం ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు వెల్ల‌డించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement