Monday, October 21, 2024

TG | ఏడు జిల్లాలకు సబ్‌ కలెక్టర్లుగా ట్పైనీ ఐఏఎస్‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఏడు జిల్లాలకు సబ్‌ కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లకు సబ్‌ కలెక్టర్‌లుగా బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు ముస్సోరీలో తాజాగా శిక్షణపూర్తి చేసుకున్నారు. వీరికి ప్రభుత్వం పోస్టింగ్‌లనిచ్చింది.

శ్రద్ధాశుక్లాను కొమురంబీం అసిఫాబాద్‌ జిల్లాలోని కాగజ్‌నగర్‌కు సబ్‌ కలెక్టర్‌గా, కిరన్‌మాయి కొప్పిశెట్టిని కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌గా, నారాయణ్‌ అమిత్‌ మాలెంపాటిని నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌గా, వికాస్‌ మహతోను నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ సబ్‌ కలెక్టర్‌గా, ఉమాశంకర్‌ ప్రసాద్‌ను వికారాబాద్‌ జిల్లాలోని తాండూర్‌ సబ్‌ కలెక్టర్‌గా, మయాంక్‌సింగ్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాటారం సబ్‌ కలెక్టర్‌గా, యువరాజ్‌ మర్మత్‌ను ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌గా నియమిస్తూ సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement