Saturday, September 21, 2024

Badminton Olympics | ప్రణయ్ అవుట్… క్వార్టర్స్ లో లక్ష్య సేన్..

ఒలింపిక్స్‌లో భాగంగా బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇవాళ జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో వరుస సెట్లలో విజయం సాధించి లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ప్లేయర్లు హెచ్‌ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ తలపడ్డారు. కాగా, ఈ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-12, 21-6తో హెచ్‌ఎస్ ప్రణయ్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. ఇక, క్వార్టర్‌ఫైనల్‌లో ల‌క్ష్య‌ సేన్ చైనీస్ తైపీకి చెందిన‌ 12వ సీడ్ చౌ టియెన్ చెన్‌తో తలపడనున్నాడు.

ఇక మహిళల సింగిల్స్ 16 రౌండ్‌లో పీవీ సింధు చైనాకు చెందిన హీ బింగ్జియావోతో తలపడనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement