Thursday, September 19, 2024

TG | నాలుగు కేజీల బంగారం పట్టివేత… ఇద్దరి అరెస్ట్

కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా బంగారం తరిలిస్తున్న ఇద్దరిని డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

కాగా కోల్‌కతా నుంచి రోడ్డు మార్గంలో కారులో నగరానికి పసిడిని రహస్యంగా తరిలిస్తున్నారని డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు తనిఖీల్లో భాగంగా కారు డిక్కీలో బంగారం దాచి తీసుకెళ్తున్న ముఠా అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారాన్ని సీజ్‌ చేసి ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement