Friday, September 20, 2024

SEBI – అనీల్ అంబానీకి షాక్.. అయిదేళ్ల పాటు నిషేధం

ఐదేళ్ల పాటు నిషేధం విధించిన సెబీ
ట్రేడింగ్ పై నిషేధాజ్ఞ‌లు
అనుబంధ కంపెనీల‌కూ వ‌ర్తింపు
రూ.25 కోట్ల జ‌రిమానా
నిషేధం దెబ్బతో అనిల్ కంపెనీ షేర్లు డమాల్ ..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – ముంబై – అనీల్ అంబానీపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) నిషేధం విధించింది. ఈ నిషేధం ఐదేళ్ల వరకు అమల్లో ఉంటుందని సెబీ తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అనీల్ అంబానీపై నిషేధానికి కారణం లేకపోలేదు. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర కంపెనీలకు తరలించటంతో ఈ నిషేధం విధించింది సెబీ. అనీల్ అంబానీతోపాటు అయన‌కు సంబంధించిన మరో 24 కంపెనీలను కూడా సెక్యూరిటీస్ మార్కెట్ లో పాల్గొనకుండా ఐదేళ్లు నిషేధం విధించింది.

- Advertisement -

ఈ ఐదేళ్లు సెక్యూరిటీ మార్కెట్ కు దూరంగా ఉండాలని.. సెక్యూరిటీ మార్కెట్లతో సంబంధం ఉన్న.. అనుబంధం ఉన్న కంపెనీలతోనూ లావాదేవీలు చేయకూడదని ఆంక్షలు విధించింది. రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ కు చెందిన మాజీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంది సెబీ.

ఏ లిస్టెడ్ కంపెనీలోనూ డైరెక్టర్ లేదా కీ మేనేజ్ మెంట్ పర్సనల్ లేదా మార్కెట్ రెగ్యులేటర్ దగ్గర నమోదైన మధ్యవర్తి పొజిషన్ లోనూ నియామకానికి, లావాదేవీలకు అర్హులు కాదని స్పష్టం చేసింది సెబీ. సెక్యూరిటీ మార్కెట్ తో రాబోయే ఐదేళ్లు ఎలాంటి సంబంధం కలిగి ఉండకూడని, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇది ఇలా ఉంటే సెబీ నిర్ణయంతో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. 25 పైసలు నష్టపోయి 4 రూపాయల 45 పైసలు దగ్గర ట్రేడ్ అవుతుంది.

.

Advertisement

తాజా వార్తలు

Advertisement