Saturday, October 19, 2024

AP | విశాఖ శారదా పీఠంకు కేటాయించిన స్థలంపై సర్కార్ కీలక నిర్ణయం

విశాఖ శారదాపీఠంకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన స్థలం అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో 15ఎకరాల స్థలం విలువ రూ.220 కోట్లు అయితే… కేవలం రూ. 15లక్షల నామమాత్రపు ధరకు శారదా పీఠానికి గత ప్రభుత్వం ఇచ్చింది.

కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టింది. దర్యాప్తు అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా స్థలం అనుమతులను ప్రభుత్వం రద్దు చేసింది. దాంతో పాటే, తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం చేపట్టిన నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement