Sunday, October 20, 2024

రూ.20 లక్షల సాయాన్ని తిరస్కరించిన చిన్నారి కుటుంబం

సైదాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయాన్ని తిరస్కరించారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్తలకు ముందు.. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ లు చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. ఆర్థిక సాయం కింద రూ.20 లక్షల చెక్కును వారికి ఇచ్చారు.

అయితే ప్రభుత్వం తరఫున మంత్రులు ఇచ్చిన చెక్కును బాలిక తండ్రి తిరస్కరించారు. ఆ ఆర్థిక సాయం తమకు అవసరం లేదని, చెక్కును వెనక్కు ఇచ్చేస్తామని చెప్పారు. మంత్రులు ఆ చెక్కును అక్కడ పెట్టి వెళ్లిపోయారని, తమకు డబ్బు అక్కర్లేదని, న్యాయం కావాలని డిమాండ్ చేశారు. మరో రూ.20 లక్షలు ఇచ్చినా తీసుకోబోమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement