Thursday, September 12, 2024

5th Medal | రుబీనా గురి కుదిరింది… భార‌త్ ఖాతాలో మరో ప‌త‌కం !

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. ఈరోజు (శనివారం) జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1లో రుబీనా ఫ్రాన్సిస్ కాంస్యం మెరిసింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్స్‌లో రుబీనా 211.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి భారత్‌కు కాంస్యం అందించింది. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 5కి చేరింది. ఇక‌ ఇరాన్‌కు చెందిన సరెహ్ జవాన్‌మర్డి స్వ‌ర్ణం సాధించ‌గా… టర్కీకి చెందిన ఐసెల్ ఓజ్గాన్ రజతం ద‌క్కించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement