Monday, October 7, 2024

RR vs GT | చెలరేగిన శాంసన్, పరాగ్.. గుజరాత్ ముందు భారీ టార్గెట్

జైపూర్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. రియాన్ పరాగ్ (76), సంజూ శాంసన్ (68 – నాటౌట్) హాఫ్ సెంచ‌రీల‌తో చెలరేగారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు చేసిన‌ రాజస్థాన్‌.. 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

రాజ‌స్థాన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 19 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట‌య్యాడు. ఆ తరువాత ఓవర్లో బట్లర్ (8) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక ఆఖ‌ర్లో వ‌చ్చిన షిమ్రాన్ హెట్మెయర్ 5బంతుల్లో 13 పరుగులతో ఆక‌ట్టుకున్నాడు. దీంతో రాజ‌స్థాన్ స్కోర్ భ‌రీగా వెల్లింది.

ఇక గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో వికెట్ ద‌క్కించుకున్నారు. కాగా, 198 ప‌రుగుల టార్గెట్ తో గుజార‌త్ టైట‌న్స్ చేజింగ్ కు దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement