భారత మాజీ దిగ్గజం రాబిన్ ఉతప్ప క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు ఇవ్వాల (బుధవారం) రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విశయాన్ని అతను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా ప్రకటించాడు. మూడుసార్లు IPL ఛాంపియన్, మాజీ ఆరెంజ్ క్యాప్ విజేత, ఉతప్ప 2006లో ఇంగ్లాండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఉతప్ప చివరిసారిగా 2015లో భారత్ తరఫున ఆడాడు.
ఉతప్ప ODIలు & T20Iలలో 59 ఇన్నింగ్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతను గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పూణే వారియర్స్ ఇండియా, రాజస్థాన్ రాయల్స్ & కోల్కతా నైట్ రైడర్స్ తరపున కూడా కనిపించాడు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక, సౌరాష్ట్ర, కేరళలకు ప్రాతినిధ్యం వహించాడు.