Thursday, September 19, 2024

RIP – టిడిపి సీనియ‌ర్ నేత కూన క‌న్నుమూత‌… సంతాపం తెలిపిన చంద్ర‌బాబు ..

హైద‌రాబాద్ -తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు కూన వెంకటేష్‌ గౌడ్‌(67) గ‌త‌ రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా, సికింద్రాబాద్, సనత్‌నగర్‌ నియోజకవర్గాల నుంచి తెదేపా అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి బీసీ సెల్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తరువాత ఆయన బిఆర్ఎస్ లో చేరారు. ఇటీవల తిరిగి టిడిపిలోకి వచ్చారు.

కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూన వెంకటేష్‌ గౌడ్‌ అంత్యక్రియలు ఆయన స్వస్థలం గాజులరామారంలో నేడు నిర్వహించనున్నారు.

- Advertisement -

.
కూన మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

తెలంగాణ టీడీపీ నేత కూన వెంకటేష్ గౌడ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులుగా పార్టీకి వెంకటేష్ గౌడ్ సేవలందించారని కొనియాడారు. సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన వెంకటేష్ గౌడ్ మృతి బాధాకరమని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement