Sunday, October 6, 2024

TG | రుణమాఫీపై మోదీ వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సహా తీవ్రంగా ఖండించారు. రైతు రుణమాఫీపై మోదీ చేసిన వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురిచేశాయన్నారు. జరుగుతున్న వాస్తవాలకు మోదీ మాటలకు పొంతన లేకపోవడం తనను బాధించిందని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆధారాలతో ప్రధాని మోదీకి రేవంత్ లేఖ రాశారు.

తమ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామని సీఎం రేవంత్ అన్నారు. 22,22,067 మంది రైతులకు, రూ. 17,869.22 కోట్లు రుణమాఫీ చేశామన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అతిపెద్ద రైతు రుణమాఫీ ఇదేనని అన్నారు. రూ.2 లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులకు త్వరలో మాఫీ చేస్తామని ప్రకటించారు.

వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ కార్యక్రమం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ పూర్తి సహకారం, మార్గదర్శకత్వం కావాలని అభ్యర్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement