Thursday, October 10, 2024

Ratan Tata : ఇవాళ‌ సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు

ముంబయి: పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కోల్బాలోని నివాసానికి రతన్ టాటా పార్థీవ దేహాన్ని తరలించారు. ముంబయిలోని ఎన్సీపీఏ గ్రౌండ్ లో పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది.

అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం సంతాప దినంగా ప్రకటించింది. రతన్ టాటా ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement