Sunday, September 8, 2024

Rapido | ఎన్నిక‌ల వేల ర్యాపిడో బంపర్ ఆఫర్… ఓటర్ల‌కు ఫ్రీ రైడ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. రేప‌టితో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంద‌డ‌గా.. మరో మూడ్రోజుల్లో (ఈ నెల 30న) తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సంద‌ర్భంగా.. ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో హైదరాబాద్ ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓట‌ర్ల‌కు ఫ్రీ రైడ్ ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపింది. ఓటింగ్ రోజున నగరంలోని 2,600 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను ఉచితంగా తీసుకెళతామని వెల్లడించింది.

పోలింగ్ కేంద్రాలకు ఎలా చేరుకోవాలని ఓటర్లు చింతించనక్కర్లేదని, ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో బైక్ ల ద్వారా ఉచితంగా చేరవేస్తామని ర్యాపిడో కో ఫౌండ‌ర్ పవన్ గుంటుపల్లి పేర్కొన్నారు. ఓటు వేసే క్రమంలో రవాణా వ్యవస్థ ఓ ప్రతిబంధకం కారాదన్నది తమ అభిమతమని వివరించారు. యువ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించడంలో తమ ఉచిత రైడ్ పథకం ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement