Friday, September 20, 2024

TG | ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రాణి కుముదిని

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఐఏఎస్ అధికారిణి రాణి కుముదిని బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారిణి రాణికుమిదిని తాజాగా బాధ్యతలు స్వీకరించారు. 1988 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన రాణి కుముదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

ఆ తర్వాత 2023 జులైలో రిటైర్ అయ్యారు. అయితే రాణికుమిదిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె (గురువారం) హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్‌ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల వరకు ఆమె తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement