Tuesday, July 2, 2024

TG | ఈవీడీఎం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రంగనాథ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్‌గా సీనియర్ ఐపీఎస్ ఏవీ రంగనాథ్ (బుధవారం) బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది నూతన కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని బొకేల‌తో అభినందించారు.

ఇదిలా ఉంటే, ఈ విభాగం బంజారాహిల్స్‌లో అసర్ట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పేరుతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌గా పనిచేస్తుంది. రంగనాథ్ నేతృత్వంలో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు, నలుగురు డీఎస్సీలను పోలీసు శాఖ నుంచి డిప్యూటేషన్‌పై తీసుకోనున్నారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణలో ఈ విభాగం కీలకం కానుంది. గతంలో వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వహించిన రంగనాధ్ ఈవీడీఎం కమిషనర్ గా మరిన్ని విజయాలు సాధించాలని పలువురు ఉద్యోగులు ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement