Thursday, September 19, 2024

AP | మెట్రో రైల్‌ ఎండీగా రామకృష్ణారెడ్డి..

ఆంధ్రప్రదేశ్‌ మెట్రో రైల్‌ ఎండీగా ఎన్. పి.రామకృష్ణారెడ్డి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుత ఎండీ జయ మన్మదరావును రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఆంధ్రలో మెట్రో రైల్‌ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీంతో మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో విశేష అనుభవం ఉన్న రామకృష్ణారెడ్డిని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తున్నట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement