Tuesday, September 17, 2024

Raksha Bandhan – చిన్నారుల‌తో మోదీ రాఖీ వేడుక‌లు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – ప్రధాని నరేంద్రమోదీ రక్షా బంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి చేసుకున్నారు. దిల్లీ పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు. అనంతరం మోదీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతేడాది కూడా ప్రధాని ఇలాగే స్కూల్‌ విద్యార్థినులతో రాఖీ కట్టించుకున్న సంగతి తెలిసిందే. ఇక, అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement