Saturday, October 5, 2024

IND vs ENG | సెమీఫైన‌ల్ మ్యాచ్ కు వ‌రుణుడు అడ్డంకి..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా నేడు జ‌రుగుతున్న రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా మారాడు. గ‌యానా వేదిక‌గా జరుగుగున్న ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతుండగా… వర్షం కారణంగా ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం అయ్యింది. ఇక టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుని.. భారత్ జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

అయితే, మ్యాచ్ ఆలస్యంగా ఆరంభంలో ఈ మ్యాచ్‌కు మరోసారి వరుణుడు అడ్డు తగిలాడు. దీంతో గ్రౌండ్ స్టాఫ్ మరోసారి పిచ్ ను కవర్ చేశారు. ప్రస్తుతం టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా 8 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (26 బంతుల్లో 37), సూర్య కుమార్ యాదవ్ (7 బంతుల్లో 13) ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement