Friday, October 18, 2024

TG | ప్రొఫెసర్ జయశంకర్ సేవలు మరువలేం : సీఎండీ ఎన్.బలరామ్

ప్రొఫెసర్ జయశంకర్ అడుగు జాడల్లోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. అలాగే ఆయన చూపిన మార్గంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి అందరం సమష్టిగా కృషి చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తొలి దశ ఉద్యమం నుంచి మలి దశ పోరాటం వరకు ఆయన చేసిన భావజాల వ్యాప్తి, చూపించిన స్ఫూర్తి అందరికీ ఆదర్శమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆయన చేసిన సేవలు మరువలేవన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజర్ బోర్డు ఛైర్మన్ జనక్ ప్రసాద్, డైరెక్టర్(పి అండ్ పి) జి.వెంకటేశ్వరరెడ్డి, జీఎం(కో ఆర్డినేషన్) జి.దేవేందర్, జీఎం(పి అండ్ పి) సాయిబాబు, జీఎం ఎన్.వి.రాజశేఖరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement