Tuesday, October 22, 2024

Wayanad | ఈ నెల 23న ప్రియాంక గాంధీ నామినేషన్

ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ నెల 23న వాయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక గాంధీ కల్పేట కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా కలెక్టర్‌ ఎదుట యుడిఎఫ్‌ కూటమి అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

కాగా, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ప్రియాంక గాంధీ ఈరోజు భేటీ అయ్యారు. మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు ప్రియాంక గాంధీ నామినేషన్‌లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement