Friday, September 20, 2024

Big Breaking | ప్రైవేటు బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

ప్రైవేటు బస్సు బోల్తా పడి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడిన ఘటన పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన ముస్లిం కుటుంబం బంధువులతో కలిసి హైదరాబాద్ లో పెళ్ళికి వెళ్లి సోమవారం రామగుండం తిరిగి వచ్చే క్రమంలో కాట్నపల్లి వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సమాచారం అందుకున్న పెద్దపల్లి ఏసీపీ మహేష్, సుల్తానాబాద్ సిఐ జగదీష్, ఎస్ఐ విజయేందర్ లు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement