Friday, October 18, 2024

Delhi: టీచ‌ర్ గా మారిన రాష్ట్ర‌ప‌తి..

రాష్ట్ర‌ప‌తిగా ఏడాది..
కేంద్రీయ విద్యాల‌యానికి వెళ్లిన ముర్ము
తొమ్మిదో క్లాస్ విద్యార్ధుల‌కు పాఠాలు
అమ్మ పేరుతో మొక్క‌లు నాటాల‌ని పిలుపు
ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ … న్యూఢిల్లీ : దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భాన్ని ఆమె మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌లోని డా.రాజేంద్ర ప్రసాద్‌ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఆశ్చర్యపర్చారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు.

తొలుత విద్యార్థుల పేర్లు అడిగి వారితో ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలు తెలుసుకున్నారు. ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని, సాంకేతికంగా వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ముర్ము అన్నారు. అనంతరం ‘గ్లోబల్‌ వార్మింగ్‌’పై వారికి బోధించారు. భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు తెలియజేశారు. నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు. పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్ .. అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి… ‘ గురించి ప్రస్తావించారు. ప్రతీ విద్యార్థి తమ పుట్టిన రోజున ఓ మొక్క నాటాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement