Saturday, September 21, 2024

చనిపోయిన వ్యక్తికీ ప్రికాషనరీ డోస్‌.. హైదరాబాద్‌లో వింత ఘటన

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : చనిపోయిన వ్యక్తికి ప్రికాషనరీ డోస్‌ వేసినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్‌రావడంతోపాటు వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ అయింది. హైదరాబాద్‌కు చెందిన పీ. పవన్‌ తండ్రి గత ఏడాది జులై 21న చనిపోయారు. డెత్‌ సర్టిఫికెట్‌ కూడా జారీ అయింది. కాని అదే ఏడాది డిసెంబరు 3న ఆయనకు కరోనా రెండో డోస్‌ వేసినట్లు మెసేజ్‌ వచ్చింది.

అయితే.. తాజాగా జులై 8న తన తండ్రికి ప్రికాషనరీ డోస్‌ వేసినట్లు కూడా మెసేజ్‌ రావడంతో ఆశ్చర్యపోయాడు. పైగా వ్యాక్సినేషన్‌ సర్టి ఫికెట్‌ కూడా జారీకావడంతో విషయాన్ని ట్వట్టర్‌ లో ఉంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement