Wednesday, October 2, 2024

Jan Suraaj | కొత్త పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి సందర్భంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీహార్‌లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, తమ పార్టీ గత రెండు, మూడు సంవత్సరాలుగా యాక్టివ్‌గా పనిచేస్తోందని…. తాజాగా,ఎన్నికల సంఘం తమ పార్టీని అధికారికంగా ఆమోదించిందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement