Tuesday, September 17, 2024

Paris Olympics | ప్రణయ్ శుభారంభం…

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో భారత స్టార్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ విజయం సాధించాడు. గ్రూప్-కెలో ఉన్న ప్రణయ్ జర్మనీకి చెందిన ఫాబియన్ రోత్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుస సెట్లలో విజయం సాధించాడు. అతను ఫాబియన్ రోత్‌ను 21-18, 21-12 తేడాతో ఓడించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించాడు. కాగా, హెచ్‌ఎస్ ప్రణయ్ తన తదుపరి మ్యాచ్‌లో 31న వియత్నాం ఆటగాడు లే డు ఫాట్‌తో తలపడనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement