Wednesday, October 9, 2024

Modi | లావోస్‌ పర్యటనకు ప్రధాని మోడీ..

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు లావోస్‌లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. లావోస్ పర్యటనలో మోదీ 21వ ఆసియాన్-ఇండియా (ఆసియాన్), ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్‌లో పాల్గొంటారు.

లావోస్ ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో, భారత్‌ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముంది. ఈ సదస్సులో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలకు సంబంధించిన సమావేశాల్లో కూడా మోదీ పాల్గొంటారు.

భారతదేశంలో యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ వచ్చి దశాబ్ద కాలం అవుతున్న నేపథ్యంలో ఈ పాలసీ ఇండో-పసిఫిక్‌ అభివృద్ధికి కీలకమైందని విదేశాంగ శాఖ పేర్కొన్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల వరుసగా ఇటలీ, రష్యా, అస్ట్రియా, పోలెండ్‌, ఉక్రెయిన్‌, బ్రూనై, సింగపూర్‌, అమెరికా దేశాల్లో పర్యటించారు.

ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ మొయిజ్జు భారత పర్యటనలో ఉన్నారు. మొయిజ్జు కూడా తమ దేశ పర్యటనకు రావాలని మోడీని ఆహ్వానించారు. అందుకు మోడీ సైతం సానుకూలంగా స్పందించారు. ప్రధానిగా మోడీ తన పదవీ కాలంలో ఇప్పటివరకు 72 దేశాలలో పర్యటించడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement