Wednesday, October 23, 2024

Brics Meeting: నేడు చైనా అధ్య‌క్షుడితో ప్ర‌ధాని మోడీ భేటీ

క‌జ‌న్: బ్రిక్స్ స‌మావేశాలు ర‌ష్యాలోని క‌జ‌న్ సిటీలో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌తో ప్ర‌ధాని మోడీ భేటీకానున్నారు. ఈ విష‌యాన్ని విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిశ్రి తెలిపారు.

గ‌త కొన్నాళ్లుగా వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉన్న ఉద్రిక్త‌త‌ల‌కు రెండు దేశాలు ముగింపు ప‌లికాయి. ల‌డఖ్ లో పెట్రోలింగ్ నిర్వ‌హించే అంశంలో డీల్ కుదిరిన‌ట్లు రెండు రోజుల క్రితం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే ఈ అంశంపై ఇరు దేశాధినేత‌లు బ్రిక్స్ భేటీలో చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement