Thursday, October 3, 2024

TG | ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై పిటిషన్.. విచారణ వాయిదా

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై గురువారం (జూలై 11) తెలంగాణ హైకోర్టు విచారణ చేప్టటింది. ఏజీ సుదర్శన్‌ రెడ్డి వాదనల తర్వాత ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్ట్‌ సోమవారానికి వాయిదా వేసింది.

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేం దర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పిటిషన్ వేశారు. హైకోర్టు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కోర్టుముందు వాదనలు వినిపించారు. వాదోపవాదాలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను సోమవారానికి (జూలై 15) వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement