Saturday, September 21, 2024

TG | స్మితా సబర్వాల్‌పై హైకోర్టులో పిటిషన్..

తెలంగాణ ఐఏఎస్, రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యురాలు స్మితా సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల నిరసనను తెలిపారు. ఆమె వ్యాఖ్యలపై పలువర్గాల‌ ప్రముఖులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా స్మితా సబర్వాల్ వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ మేరకు సామాజికవేత్త వసుంధర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్పీ చైర్మన్‌కు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. అయితే పిటిషనర్‌కు ఉన్న అర్హతను హైకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ వికలాంగురాలు అని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement