Friday, September 20, 2024

Pawan Kalyan … ఆనాటి హీరోలు అడ‌వుల‌ను కాపాడితే … ఈనాటి హీరోలు న‌రికేస్తున్నారు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – బెంగ‌ళూరు – ఒక‌ప్ప‌టి హీరోలు అడ‌వుల‌ను కాపాడేవారిగా న‌టించి మెప్పిస్తే…ఇప్ప‌టి హీరోలు ఆ ఆడ‌వుల‌ను న‌రికే వారిగా న‌టిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు ప‌వ‌ర్ స్టార్, ఎపి ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ … బెంగుళూరు ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న నేడు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌ను క‌లిశారు..అనంత‌రం ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే భేటి అయ్యారు.. దీనికి ముందు అక్క‌డి మీడియాతో మాట్లాడుతూ, నిమాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం వ‌స్తున్న సినిమాల్లో అడ‌వుల‌ను న‌రికివేస్తున్నారని అన్నారు. నాకు చాలా నచ్చింది ఏంటి అంటే దివంగ‌త క‌న్న‌డ న‌టుడు రాజ్ కుమార్ న‌టించిన చిత్రం గంధడగుడి. ఈ సినిమా థీమ్ ఏంటి అంటే అడవుల‌ను కాపాడ‌డం. నాకు కూడా ఇలాంటి సినిమాల్లో న‌టించాలా అనిపించేది. ఇంత‌కుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడ‌వుల‌ను న‌రికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నాన‌ని అప్పుడ‌ప్పుడు బాధ‌గా అనిపిస్తుంటుంది. ఇలాంటివి త‌గ్గి మ‌ళ్లీ అడవుల ప్రాముఖ్య‌త తెలిసేలా సినిమాలు రావాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిప్రాయ‌ప‌డ్డారు..

- Advertisement -

ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ ను అరిక‌డ‌దాం ..

ఆ త‌ర్వాత . కర్ణాటక అటవీ శాఖ మంత్రితో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ చర్చలు జరిపారు. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరారు. అలాగే ఎపిలో ఏనుగుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఇక్క‌డ ట్రైన్డ్ ఏనుగుల‌ను పంపాల‌ని కోరారు ప‌వ‌న్..

ఎపి కి 8 కుంకి ఏనుగులు….

మొత్తం ఏడు అంశాలపై చర్చించినట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని, ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఏనుగుల దాడిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని తెలిపారు. ఏనుగుల సమస్య పరిష్కరించేందుకు 8 కుంకి ఏనుగులను ఏపీకి ఇచ్చేందుకు కర్ణాటక ఒప్పుకోవడం సంతోషమని పేర్కొన్నారు

.అటవీ సంపద రక్షణకు ఐటీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఎర్రచంద్రనం అక్రమ రవాణాను అరికట్టాలని, వన్యప్రాణుల స్మగ్లింగ్‌ చేసే వారిని కట్టడి చేయాలని నిర్ణయించామని తెలిపారు. సుమారు రూ. 140 కోట్ల విలువ గల ఎర్రచందనాన్ని పట్టుకున్న కర్ణాటక అటవీ అధికారులను అభినందించారు. శ్రీశైలం , తిరుపతి క్షేత్రాలకు వచ్చే కర్ణాటక భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

స‌మావేశం అనంత‌రం ప‌వ‌న్ క‌ల్యాణ్ ను క‌ర్నాట‌న మంత్రి స‌త్క‌రించి జ్ఞాపిక‌ను అంద‌జేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement