Friday, October 18, 2024

Passengers Alert | ఇవిగో మ‌రికొన్ని రైళ్లు ర‌ద్దు !

రైల్వే ప్ర‌యానికుల‌కి అలెర్ట్ !! నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్‌-పుణెల మధ్య నడిచే శతాబ్ది తో సహా పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

ఈ రైళ్లు రద్దు..

విజయవాడ – భద్రాచలం రోడ్ (07979), భద్రాచలం రోడ్ – విజయవాడ (07278), డోర్నకల్ – విజయవాడ (07755), విజయవాడ – డోర్నకల్ (07756), విజయవాడ – సికింద్రాబాద్ (12713), సికింద్రాబాద్ – విజయవాడ (12714) శాతవాహన ఎక్స్ ప్రెస్, గుంటూరు – సికింద్రాబాద్ (17201), సికింద్రాబాద్ – గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆగస్ట్ 5 నుంచి 10 వరకూ రద్దయ్యాయి.

పుణె – సికింద్రాబాద్ శతాబ్ది ఎక్ర్ ప్రెస్ (12205) రైలు ఈ నెల 29, 31, ఆగస్ట్ 1వ తేదీల్లో రద్దైంది. సికింద్రాబాద్ – పుణె శతాబ్ది ఎక్స్ ప్రెస్ (12206) రైలు ఈ నెల 29, 31వ తేదీల్లో రద్దైంది.

సికింద్రాబాద్ – ముంబయి ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12220) ఈ నెల 30న, ముంబయి – సికింద్రాబాద్ ఏసీ దురంతో ఎక్స్ ప్రెస్ (12219) ఈ నెల 31న రద్దయ్యాయి. అలాగే, నిజామాబాద్ – పుణె (11410) ఈ నెల 31న రద్దైంది.

- Advertisement -

దారి మళ్లింపు..

హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ (18046)తో పాటు సికింద్రాబాద్ – విశాఖ మధ్య తిరిగే గోదావరి, సికింద్రాబాద్ – తిరుపతి మధ్య తిరిగే పద్మావతి, సికింద్రాబాద్ – గూడూరు మధ్య తిరిగే సింహపురి, ఆదిలాబాద్ – తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కృష్ణా ఎక్ర్ ప్రెస్‌లతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement