Saturday, September 7, 2024

Paris Olympics | తొలి రౌండ్‌లో భారత జోడీ విజయం..

పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ విజయం సాధించింది. గ్రూప్-సిలో ఉన్న చిరాగ్, సాత్విక్‌లు… ఫ్రాన్స్‌కు చెందిన లూకాస్ కార్వే, రోనన్ లాబర్ జోడీతో త‌ల‌ప‌డ‌గా… ఈ మ్యాచ్‌లో వరుసగా రెండు సెట్లలో 2-0తో విజయం సాధించారు.

సాత్విక్, చిరాగ్‌ల జోడీ 21-17, 21-14 పాయింట్లతో లూకాస్ కార్వే, రోనన్ లాబర్ లను ఓడించి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించింది. కాగా, సాత్విక్, చిరాగ్ జోడీ తమ తదుపరి మ్యాచ్‌లో జర్మనీకి చెందిన మార్విన్ సీడెల్, మార్క్ లామ్స్‌ఫస్‌లతో తలపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement