Wednesday, September 18, 2024

Paris Olympics – ఫైన‌ల్స్ లో మ‌న ‘బ‌ల్లెం’ వీరుడు…

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్‌లో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్స్‌ లోకి ప్రవేశించాడు. గ్రూప్ బిలో ఉన్న నీరజ్ 89.34 మీటర్ల దూరం విసరడంతో ఫైనల్‌ లోకి ప్రవేశించాడు. ఈ ఈవెంట్‌లో 84 మీటర్ల మార్కు నేరుగా ఫైనల్‌ కు అర్హత సాధించేలా సెట్ చేశారు. కాగా, భారత్‌కు చెందిన మరో త్రోయర్ కిషోర్ జెనా 80.73 మీటర్ల విసిరాడు, దీంతో అతను ఫైనల్ కి అర్హత సాదించలేకపోయాడు.

ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ గేమ్స్‌లో పతకం సాధించడంలో సఫలమైతే నీరజ్ చోప్రా కూడా 2 ఒలింపిక్ పతకాల భారత ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. వ్యక్తిగత ఈవెంట్‌లో ఇప్పటివరకు నార్మన్ ప్రిచర్డ్, సుశీల్ కుమార్, పివి సింధు, మను భాకర్ భారతదేశం నుంచి 2 ఒలింపిక్ పతకాలు సాధించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement